Monday, April 27, 2020

సాక్ష్యం 35

సాక్ష్యం 35

జేగుంట చార్లెస్
మానికొండ
70 సంవత్సరాలు

నా పేరు జేగుంట చార్లెస్. అప్పుడు జోజప్ప గారు అవుటపల్లిలో తిరుగుతున్నారు. మేము డ్రామా చేస్తుంటే చూడటానికి వచ్చారు. ‘నాకు ఆకలి అవుతుందిఅని అడిగితే, జోజప్ప గారునాతో రాఅని నన్ను తీసుకు వెళ్ళి పోయారు. వారి ఇంటికి తీసుకు వెళ్లి, నాకు పచ్చ పెసల్లు పెట్టారు. తర్వాత వచ్చి, డ్రామా చూసాను. జోజప్ప గారూ మాతోపాటు వస్తామన్నారు. కాలువ దిగి రావాల్సి వచ్చేసరికి, మాలో పదిమంది వుంటారు. బారుగా ఉన్నానని, ఏం చేశారంటే, తంబి గారిని భుజం మీద ఎక్కించు కొని, కాలువ దాటేసి, మానికొండకు తీసుకు వెళ్ళాను. అక్కడ ఒక వారం పది రోజులు వున్నారు. అపుడు నాకు పదిహేను సంవత్సరా లుంటాయి. అక్కడ నుండి, అవుటపల్లిలో క్లారమ్మ గారి ఇంటికి వచ్చారు. ఇక్కడికి వచ్చినపుడు జ్వరంతోనే వచ్చారు.

జోజప్ప గారికి బాగుండట్లేదని, చూసి వద్దామని మాలో పది, పండెండు మంది వచ్చాము. మేము వచ్చినపుడు, జోజప్ప గారు క్లారమ్మ గారి ఇంట్లో, మంచం మీద పడుకొని వున్నారు. వచ్చి మాట్లాడించాము. తర్వాత వెళ్ళిపోయాము. వారం రోజులయ్యాక, ఇక జోజప్ప చని పోయారని అన్నారు. ప్రతి సంవత్సరము, పండుగ చేస్తున్నారు. నేను బాగున్నాను కాబట్టి తంబి గారి మీద అభిమానముతో నేను ఒక్కడినే వచ్చేశాను, వచ్చి పండుగ చూశాను. పూజ చూశాను, ప్రార్ధన చేశాను. మరి ఆకలి అవుతుందప్పుడు, అప్పుడు ఇక్కడి వారు పులిహారం చేసి, పొట్లాలు కట్టి అమ్మేస్తున్నారు, తిన్నాను. మా ఆకలి తీరింది. జోజప్ప గారు, నాకు ఆహారం పెట్టారు, అని చెప్పాను. వారందరూ నా వంక  వేలాకోలం చేసారు; జోజప్ప గారు నీకు తెలుసా, తెలుసా అని అడిగారు. ‘నాకు తెలుసుఅన్నాను. ‘ఎట్లా?’ అన్నారు. ‘నాకు పచ్చి పెసర్లు పెట్టారు,’ అని చెప్పాను. ఇక అక్కడి నుండి వచ్చేశాను.

జేగుంట చార్లెస్, మానికొండ

No comments:

Post a Comment