సాక్ష్యం 15
పేరు : వేము జోజిబాబు (శ్రీరాములు)
వయస్సు : 76 సం.లు
వృత్తి : కూలి
అడ్రస్ : కేసరపల్లి (పోస్ట్), గన్నవరం మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
బ్రదర్ జోసఫ్ తంబి గారు మా గ్రామములో
వున్నప్పుడు పిల్లలకు స్వీట్లు పంచేవారు. కొన్నిసార్లు మాకు ఇచ్చేవారు కాదు. ఆ సమయములో మేము ఆయనపై రాళ్ళు
విసిరే వాళ్ళం.
ఒకసారి నేను ఆయన
ఇంట్లోని సిలువను (చెక్కది) పెద్ద కుండ ప్రక్కన దాచి పెట్టాను. తంబిగారు, “నీవు నా సిలువను దొంగి లించావు, దానిని నీవు పెద్ద కుండ ప్రక్కన దాచిపెట్టావు, వెంటనే తీసుకురా” అని చెప్పారు. నేను అవాక్కయ్యాను. వెంటనే వెళ్లి దానిని తిరిగి తీసుకు
వచ్చాను. ఆయన వెంటనే నాకు ఇచ్చేసారు.
ప్రార్ధన ద్వారా బోదకాలు
ఉన్న ఒక అతనిని బాగు చేశారు. అదేవిధంగా ప్రతిరోజు ఆయన 3-4 గంటలు ప్రార్ధనలోనే గడిపేవారు. కేసరపల్లి నుండి అవుటపల్లి వెళ్లి స్థిరపడిన
తర్వాత ఆయనకు పంచగాయాలు వచ్చాయని నేను విన్నాను. ఆ తర్వాత తంబిగారు చాలా అద్భుతాలు చేసారని
కూడా విన్నాను.
వేము జోజిబాబు, కేసరపల్లి
1 ఆగష్టు 2009
![]() |
వేము జోజిబాబు |
No comments:
Post a Comment